పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు మోహన్ బాబు. తన ఇద్దరు కొడుకులు విష్ణు, మనోజ్ కథానాయకులైనా తొలి అడుగుల్లో సరైన విజయాలు సాధించలేకపోయారు. వాళ్ళను ఎలాగైనా ఓ స్థాయిలో నిలబెట్టాలని తపిస్తూ వచ్చారు మోహన్ బాబు. అందుకోసం తన సొంత సంస్థలో సినిమాలు తెరకెక్కించారు. చాలాసార్లు నష్టపోయారు. అయినా మళ్ళీ సినిమాలు తీశారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. తన ఇద్దరు కొడుకులూ ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విష్ణు `దేనికైనా రెడీ` సినిమాతో ఫాంలోకి వచ్చాడు. ఇక నుంచి దూసుకేళ్లడమే మిగిలిందంటున్నాడు.
అలాగే మనోజ్ కూడా `పోటుగాడు`గా నిరూపించుకున్నారు. తనదైన శైలిలో నటించి విజయం అందుకున్నారు. ఇద్దరు కొడుకులు సాధిస్తున్న ఫలితాలతో మోహన్ బాబు ఎంతో ఖుషీగా ఉన్నాడు. విష్ణు కథానాయకుడిగా నటించిన `దూసుకెళ్తా ` చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమాని చూసిన మోహన్ బాబు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ``విష్ణు బాబు అదరగొట్టాడు. చాలా బాగా నటించాడు. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మొత్తం 600 థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నాం`` అని మోహన్ బాబు చెప్పారు.
అలాగే మనోజ్ కూడా `పోటుగాడు`గా నిరూపించుకున్నారు. తనదైన శైలిలో నటించి విజయం అందుకున్నారు. ఇద్దరు కొడుకులు సాధిస్తున్న ఫలితాలతో మోహన్ బాబు ఎంతో ఖుషీగా ఉన్నాడు. విష్ణు కథానాయకుడిగా నటించిన `దూసుకెళ్తా ` చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమాని చూసిన మోహన్ బాబు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ``విష్ణు బాబు అదరగొట్టాడు. చాలా బాగా నటించాడు. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మొత్తం 600 థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నాం`` అని మోహన్ బాబు చెప్పారు.

