అత్తారింటికి దారేది సినిమా పైరసీ గొడవ మధ్య విడుదలైనా ఘన విజయాన్ని సాధించింది. గబ్బర్సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్కు అందిన మరో భారీ హిట్ ఇది. సమంత, ప్రణీత నాయికలుగా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలను చెప్పుకోనుంది. గత ఆదివారమే ఈ కార్యక్రమం జరగాల్సింది. కానీ సమైక్యాంధ్ర గొడవల వల్ల వాయిదా పడింది. కానీ ఈ ఆదివారం తప్పకుండా యూనిట్ మొత్తం పెద్ద వేడుకలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. శిల్పకళావేదిక ఈ వేడుకకు వేదిక కానుంది.
పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడంతో పవన్ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేందుతు సిద్ధమౌతున్నాడు. ఈ సక్సెస్ సంబరాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీగా హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలను చెప్పుకోనుంది. గత ఆదివారమే ఈ కార్యక్రమం జరగాల్సింది. కానీ సమైక్యాంధ్ర గొడవల వల్ల వాయిదా పడింది. కానీ ఈ ఆదివారం తప్పకుండా యూనిట్ మొత్తం పెద్ద వేడుకలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. శిల్పకళావేదిక ఈ వేడుకకు వేదిక కానుంది.
పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడంతో పవన్ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేందుతు సిద్ధమౌతున్నాడు. ఈ సక్సెస్ సంబరాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీగా హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

