మోహన్ బాబు తనయ లక్ష్మీ ప్రసన్న ఆల్ రౌండర్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నటన, నిర్మాణం, టీవీ హోస్టింగ్... తదితర అంశాల్లో రాణిస్తోంది. తొలి చిత్రంతోనే ఉత్తమ ప్రతినాయికగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తండ్రికి కలగా మిగిలిన ఆ పురస్కారాన్ని తొలి ప్రయత్నంలోనే చేజిక్కించుకుని శభాష్ అనిపించుకుంది. నిర్మాణంలోనూ తనదైన శైలిలో రాణిస్తోంది. `ఊ కొడతారా ఉలిక్కిపడతారా`, `గుండెల్లో గోదారి` లాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మించింది.
అయితే లక్ష్మీ ఇంతటితో ఆగిపోవాలనుకోవడం లేదు. దర్శకత్వం కూడా చేయబోతున్నా అని తాజాగా ప్రకటించింది. ఎప్పటికైనా ఓ మంచి సినిమా చేయాలనేది నా కల. అది త్వరలోనే సాకారం కాబోతుందని లక్ష్మీ ప్రకటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ``ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఓ ప్రముఖ కథానాయకుడు కాల్షీట్లు కూడా ఉన్నాయి. మంచి సమయం చూసుకుని సినిమాని ప్రారంభిస్తా`` అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ ప్రస్తుతం `చందమామ కథలు` అనే సినిమాలో కీలకమైన పాత్ర చేసింది.
అయితే లక్ష్మీ ఇంతటితో ఆగిపోవాలనుకోవడం లేదు. దర్శకత్వం కూడా చేయబోతున్నా అని తాజాగా ప్రకటించింది. ఎప్పటికైనా ఓ మంచి సినిమా చేయాలనేది నా కల. అది త్వరలోనే సాకారం కాబోతుందని లక్ష్మీ ప్రకటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ``ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఓ ప్రముఖ కథానాయకుడు కాల్షీట్లు కూడా ఉన్నాయి. మంచి సమయం చూసుకుని సినిమాని ప్రారంభిస్తా`` అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ ప్రస్తుతం `చందమామ కథలు` అనే సినిమాలో కీలకమైన పాత్ర చేసింది.

