మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మొదలైంది. `బలుపు` రచయిత బాబీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు రవితేజ. ఆదివారం హైదరాబాద్ లో లాంచనంగా సినిమాని మొదలు పెట్టినట్టు సమాచారం. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయాస్ చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవితేజ, చౌదరి కలయికలో ఇదివరకు `నిప్పు` అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం అనుకున్నంతగా ఆదరణ పొందలేకపోయింది. మరోసారి ఈ ఇద్దరూ జత కలిశారు. రవితేజ హిందీకి వెళతాడనే ప్రచారం సాగింది. అయితే ఆయన మళ్ళీ తెలుగు సినిమానే మొదలుపెట్టాడు.